
రాజకీయాలు

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. భర్త సూరజ్ నంబియార్తో విడాకుల వార్తలతో పాటు, హీరోయిన్ దిశా పటానితో ఆమె సంబంధంపై వస్తున్న పుకార్లు ఇటీవల మరింత చర్చకు దారితీశాయి. మౌనీ రాయ్, దిశా పటాని తరచూ కలిసి వెకేషన్స్, పార్టీల్లో కనిపిస్తూ ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ పుకార్లపై స్పందించిన మౌనీ రాయ్ తాజాగా దిశా పటానితో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ “నా లేబుల్ సిస్టర్ను చాలా మిస్ అవుతున్నాను” అని క్యాప్షన్ పెట్టింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నెగెటివ్ కామెంట్ల కారణంగానా లేదా పొరపాటున క్యాప్షన్ పెట్టాననే భావనతో తొలగించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!