

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలోని గ్రాండ్ సెట్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా నటి మంచు లక్ష్మి రాకా షూటింగ్ సెట్ను సందర్శించడం హాట్ టాపిక్గా మారింది. అక్కడ జరుగుతున్న భారీ స్థాయి వర్క్ను చూసిన ఆమె.. తాను ఇప్పటివరకు చూడని రకాల జీవులు, భారీ మొక్కలు, అద్భుతమైన సెట్స్ తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. వివిధ విభాగాలకు చెందిన వందలాది మంది కలిసి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తున్న విధానం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. రాకాలో కనిపించబోయే ప్రపంచం ప్రేక్షకుల ఊహలకు కూడా అందని స్థాయిలో ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అట్లీ తొలిసారి అల్లు అర్జున్ను డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మంచు లక్ష్మి సెట్ విజిట్ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాకా ఏ స్థాయిలో తెరకెక్కుతోందనే విషయంపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!