
గాసిప్స్

తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టీమ్ శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, రామజోగయ్య శాస్త్రి తదితరులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆలయం వెలుపల అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉందని వెల్లడించారు. ప్రేక్షకులను ఎక్సైట్ చేసేలా ట్రైలర్ ఉంటుందని, ఈ ఏడాది సంక్రాంతికి తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!