

తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్గా నిలిచిన సూపర్స్టార్ మహేశ్ బాబు చిత్రం అతడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహేశ్ బాబు ఇంటెన్స్ నటన, పవర్ఫుల్ డైలాగ్స్, మణిశర్మ సంగీతంతో అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టీవీలో ప్రసారం అయినప్పుడల్లా ఇప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా చూసే సినిమాగా అతడు నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ కల్ట్ క్లాసిక్ మూవీని ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రీ-రిలీజ్ చేయనున్నారు. అత్యాధునిక 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్తో సినిమాను రీ-స్టోర్ చేయగా, థియేటర్లలో కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. నందు అలియాస్ పార్ధు పాత్రలో మహేశ్ బాబు వేరియేషన్స్, ఇంటర్వెల్ ఫైట్ నుంచి క్లైమాక్స్ వరకు సన్నివేశాలు, బ్రహ్మానందం కామెడీ, త్రిష గ్లామర్, సోనూ సూద్ విలనిజం కలిసి ఈ సినిమాను ఒక బెంచ్మార్క్గా నిలిపాయి. ఇప్పటికే రీ-రిలీజ్ ట్రెండ్లో మహేశ్ చిత్రాలు సంచలనాలు సృష్టించగా, ఇప్పుడు అతడు కూడా కొత్త రికార్డులకు సిద్ధమవుతోందని అభిమానులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!