

మహేశ్ బాబు మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
‘వారణాసి’ చిత్రీకరణ పూర్తైన వెంటనే సందీప్ వంగా ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు కోసం ప్రత్యేకంగా ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ తన చిత్రాల్లో హీరోలను వైల్డ్ స్టైల్ లో చూపించే తీరు, మహేశ్ బాబు యొక్క క్లాస్ మరియు మాస్ ఇమేజ్ కలయిక ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతోంది. అలాగే మహేశ్ బాబు మరియు సునీల్ నారంగ్ మధ్య ఏఎంబీ సినిమాస్ ద్వారా ఉన్న వ్యాపార అనుబంధం కూడా ఈ ప్రాజెక్ట్ త్వరగా ఓకే కావడానికి కారణమైందని చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!