
బ్రిహస్పతి ఎంటర్టైన్మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్లపై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోషా నవీన్ సంయుక్తంగా నిర్మించిన ‘లేచింది మహిళాలోకం’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. అర్జున్, కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య చిన్న చిన్న విషయాల వల్ల ఏర్పడే విభేదాలు, వాటిని పొరుగువారు మరింత పెంచడంతో జరిగే పరిణామాలను హాస్యంతో పాటు ఉత్కంఠగా చూపించే కుటుంబ వినోద చిత్రం ఇది. ఈ చిత్రం ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచు లక్ష్మి ఈ చిత్రం హత్యలను ప్రోత్సహించే కథ కాదని, అందరినీ నవ్వించే వినోదాత్మక చిత్రమని తెలిపారు. మంచి వినోదంతో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో బృందం ఈ చిత్రాన్ని రూపొందించిందని చెప్పారు. నటీనటులు, దర్శకులు కూడా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 26 న చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూసి ఆనందించాలని ప్రేక్షకులను కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!