

ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన శంకర్ ప్రస్తుతం వరుస డిజాస్టర్స్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు భారీ చారిత్రక చిత్రం ‘వేల్పారి’పై ఫోకస్ పెట్టారు. సు. వెంటేశన్ రాసిన వీర యుగ నాయగన్ వేల్ పారీ నవల ఆధారంగా ఈ సినిమాను మూడు భాగాల భారీ హిస్టారికల్ ఎపిక్గా రూపొందించనున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు సమాచారం.
ఇక వేల్పారికు ముందు శంకర్ ఒక యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ డిజాస్టర్స్ తర్వాత తనను తాను మళ్లీ నిరూపించుకోవడానికి ఆయన ఈ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా స్క్రీన్ప్లే ఆధారితంగా ఉండే ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!