
జనరల్

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఇటీవల ఓటింగ్ సభ్యత్వం లభించింది. ఇది భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణమైన విషయం. అయితే ఆయనకంటే ముందే పలువురు భారతీయ సినీ దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, మణిరత్నం, అశుతోష్ గోవరికర్, అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్ వంటి దర్శకులతో పాటు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి వంటి సాంకేతిక నిపుణులు కూడా అకాడమీ సభ్యత్వం పొందారు. అలాగే అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, నసీరుద్దీన్ షా, మాధురి దీక్షిత్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!