
గాసిప్స్

హే భగవాన్ చిత్రం వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలను కలగలిపిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఉంటుందని మూవీ నిర్మాత నరేందర్ రెడ్డి తెలిపారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 20 న విడుదల కానున్న ఈ సినిమా ఫాదర్–సన్ భావోద్వేగంతో పాటు నవ్వులు పంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కథ వినగానే ఆకట్టుకుందని, ప్లానింగ్ ప్రకారం నిర్మాణం సాగిందని నిర్మాత తెలిపారు. సినిమాకు ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపించేలా నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అలాగే బన్నీ వాస్, వంశీ నందిపాటిల సహకారంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. తదుపరి ప్రాజెక్ట్గా స్నేహం నేపథ్యంతో రూపొందే కమర్షియల్ చిత్రంలో సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా నటించనున్నట్లు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!