

ఎట్టకేలకు ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన పర్సెంటేజ్ వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎగ్జిబిటర్ల పర్సెంటేజ్ విధానంపై జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు సంతకంతో ఈ ప్రకటనను విడుదల చేశారు. గతంలో తన సంతకం లేకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన లేఖ పూర్తిగా ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు.
ఎగ్జిబిటర్ల కీలక సమావేశం అనంతరం అదే అంశంపై అధికారిక నిర్ణయం వెలువడింది. నిర్మాతలు ప్రతిపాదించిన షరతులను కాలపరిమితులతో చర్చించిన తర్వాత, వచ్చే భారీ సినిమా విడుదలకు ముందే లేదా 2026 జూన్ చివరి నాటికి కొత్త పర్సెంటేజ్ విధానాన్ని ఫైనల్ చేయాలని నిర్ణయించారు. అన్ని అంశాలను తెలంగాణ ఎగ్జిబిటర్లతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!