

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’ ఈ నెల 6 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. సింగిల్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.150 మాత్రమే టికెట్ ధరగా నిర్ణయించడం విశేషంగా నిలుస్తోంది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది.
ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ప్రెస్ మీట్లో చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. హీరో అమర్దీప్ చౌదరి ఈ సినిమాతో తనకు గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయగా, హీరోయిన్ శైలి చౌదరి తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు ఎం.ఎం. నాయుడు, నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి సినిమా కంటెంట్పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా ‘సుమతీ శతకం’ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!