
రాజకీయాలు

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పెద్ది సినిమా ప్రదర్శనపై కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతలు పర్సంటేజ్ ఇవ్వకపోతే సినిమా ప్రదర్శనకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పెద్ది చిత్రం ప్రదర్శనకు పర్సంటేజ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని, లేకపోతే థియేటర్లలో సినిమా ఆడదని ఎగ్జిబిటర్లు స్పష్టంగా పేర్కొన్నారు. నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని కూడా ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 250 మంది ఎగ్జిబిటర్లు ఒకే నిర్ణయంతో ఉన్నారని అసోసియేషన్ వెల్లడించింది. పర్సంటేజ్ ఒప్పందంపై సంతకం చేసి ఇవ్వగానే సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!