

‘ధురంధర్2’ చిత్రం దక్షిణాది పాన్ ఇండియా సినిమాలు ఏర్పరిచిన ప్రమాణాలకు సవాల్గా నిలవొచ్చని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, వాస్తవిక కథలు, బలమైన పాత్రలు, ఉన్నత నిర్మాణ విలువలతో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిని కొత్తగా నిర్వచించాయని పేర్కొన్నారు. అయితే దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్2’ ఆ ప్రమాణాలను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. ప్రేక్షకులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కంటెంట్ను ఆశిస్తున్నారని, కేవలం భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్, మాస్ ఎలిమెంట్స్తో సినిమాలు విజయాన్ని సాధించడం ఇక సులభం కాదని వ్యాఖ్యానించారు.
పాతకాలపు కమర్షియల్ ఫార్ములాలతో సినిమాలు తీస్తే థియేటర్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వర్మ హెచ్చరించారు. కథా బలం, పాత్రల లోతు ప్రధాన పాత్ర పోషించే కొత్త సినీ యుగానికి ఇది సంకేతమని చెప్పారు. మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్2’ సినీ పరిశ్రమపై ఉల్కాపాతం లాంటి ప్రభావం చూపుతుందని, అతిశయోక్తి హీరోయిజం మరియు మసాలా కథలకు ముగింపు పలికే అవకాశం ఉందని పేర్కొన్నారు. దర్శకులు కొత్త దిశలో ఆలోచించి తమ శైలిని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన సూచించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!