
క్రీడలు

రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు” ధారావాహిక ఈ నెల 27 నుంచి ప్రసారానికి సిద్ధమైంది. ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో మాట్లాడిన చిత్రబృందం, ఈ కథ ప్రతి తండ్రి, కూతురు భావోద్వేగాలకు దగ్గరగా ఉంటుందని, కుటుంబ విలువలు, అనుబంధాలు, ఉత్కంఠభరిత మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
దర్శకుడు కృష్ణ పోలూరు ఈ కథను రూపుదిద్దడానికి రెండేళ్లు పట్టిందని చెప్పగా, నిర్మాత కె.వి. శ్రీరామ్ ఇది హృదయానికి హత్తుకునే భావోద్వేగ కథగా నిలుస్తుందని పేర్కొన్నారు. నటీనటులు తమ పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తాయని, ప్రతి భాగం ఉత్కంఠను కొనసాగిస్తుందని తెలిపారు. కుటుంబంతో కలిసి చూడదగిన భావోద్వేగ కథగా ఇది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!