
గాసిప్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం మెగా ఫ్యాన్స్ భారీగా పోటీ పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో టికెట్లను వేలం వేసి అమ్మగా, వాటికి లక్షల రూపాయల ధర పలికింది.
నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్లో ఒక టికెట్ రూ.1 లక్ష 2 వేల ధరకు అమ్ముడైంది. అలాగే అమలాపురంలో ఫస్ట్ షో తొలి టికెట్ను ఒక బీజేపీ నాయకుడు రూ.1 లక్ష 11 వేల ధరకు దక్కించుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టికెట్ల వేలంలో వచ్చిన మొత్తం డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!