

మాస్ మహారాజా రవితేజ నటించిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఈ నెల 13 న విడుదలైన ఈ చిత్రం హౌస్ఫుల్ షోలతో విజయవంతంగా రన్ అవుతూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ను చేరుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తుండటంతో రెండో వారం నుంచి ఇంకా అద్భుతమైన రన్ కొనసాగుతుందని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించారు.
విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు సంక్రాంతి సీజన్లో భారీ డిమాండ్ ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. రవితేజతో ఇది తన రెండో సినిమా అని, ఈసారి అనుకున్న అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా వర్క్ అయ్యాయని చెప్పారు. అలాగే ‘ప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ సినిమాలు వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నామని, చిరంజీవితో పీరియాడిక్ బ్యాక్డ్రాప్ చిత్రాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కొత్త దర్శకులకు స్వేచ్ఛ ఇచ్చి మంచి సినిమాలు తీయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!