
సినిమాలు

ప్రసిద్ధ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి "అరుణాచల గిరి ప్రదక్షిణ" చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని నేపథ్యంగా తీసుకుని, భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ ప్రతిభాశాలి హర్ష వి.ఎఫ్.ఎక్స్. ను అందించగా, హర్ష.ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం డా. ఎ. జె. సంధ్యవర్షిణి మరియు డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సమకూర్చుతున్నారు.
ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టేలా రూపొందిస్తున్నట్లు తనికెళ్ళ భరణి తెలిపారు. చింతల శ్రీనివాస్ రాసిన పాటకు మధు గాత్రం అందించగా, రెండో షెడ్యూల్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, ఏప్రిల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు నిర్మాత తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!