

‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ గతంలో చేసిన “కేజీఎఫ్కు ముందు యశ్ ఎవరు?” అనే వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ ఆ వ్యాఖ్యలపై స్పందించడంతో వివాదం మరింత వేడెక్కింది.
తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంపై స్పందిస్తూ అల్లు అరవింద్ వ్యాఖ్యలను సమర్థించారు. పెద్ద సినిమాలు నటులను స్టార్లుగా నిలబెట్టగలవనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని ఆర్జీవీ పేర్కొన్నారు. ‘బాహుబలి’కి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్, ‘కాంతార’కు ముందు రిషభ్ శెట్టి గురించి పెద్దగా తెలియదని ఉదాహరణగా చెప్పారు. అలాగే హాలీవుడ్లోనూ నటుల స్టార్డమ్ కంటే కథ, కాన్సెప్ట్, దర్శకుడి విజన్కు ప్రాధాన్యం ఇస్తారని వ్యాఖ్యానించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!