

అక్కినేని అఖిల్ తన కొత్త చిత్రం ‘లెనిన్’తో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్, తన సినిమా రావడానికి మూడేళ్లు పట్టిందని అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఈసారి నిరాశపరచనని అన్నారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, ఎక్కువగా మాట్లాడకుండా సినిమా విడుదలైన తర్వాత తన పని తానే మాట్లాడుతుందని చెప్పారు. గత రెండు రోజులుగా నిద్రలేకపోయినా అభిమానులను చూసిన వెంటనే కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ‘లెనిన్’ పూర్తిగా భిన్నమైన సినిమా అని, జూలై 10న విడుదలయ్యే ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!