

ఆంధ్ర కింగ్ తాలూకా తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకంతో రామ్ పోతినేని ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా, ప్రతి కార్యక్రమానికి స్వయంగా హాజరవుతూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా కర్నూలులో ట్రైలర్ను అసాధారణమైన విధానంలో విడుదల చేస్తూ టాలీవుడ్ ప్రమోషన్స్కు కొత్త స్టాండర్డ్ సెట్ చేశారు.
ఆ ఈవెంట్లో ప్రధానాకర్షణగా నిలిచింది ఆకాశాన్నే స్క్రీన్గా మార్చిన అద్భుతమైన డ్రోన్ షో. వెయ్యి డ్రోన్లు ఒకేసారి విచిత్రమైన ఆకృతులు, మ్యాజిక్ లాంటి విజువల్స్ సృష్టించడంతో ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ వినూత్న ఆలోచనతో ఈవెంట్కు ప్రత్యేకమైన మెరుపు తీసుకొచ్చారు. ట్రైలర్లో చూపించిన కథలోని లోతు, భావోద్వేగాలు, అలాగే రామ్ నటన అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి.
ప్రస్తుతం ప్రమోషన్లు వేగంగా కొనసాగుతుండగా, టీమ్ బెంగళూరులో ఒక భారీ ఈవెంట్కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి, మరియు ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్లో శక్తివంతమైన ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!