
న్యూస్

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు లేదా ట్యాబ్లు చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. పిల్లలు త్వరగా తింటారని భావించి ఇలా చేస్తున్నప్పటికీ, ఈ ‘స్క్రీన్ ఫీడింగ్’ అలవాటు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో మాటలు ఆలస్యంగా రావడం, ఏకాగ్రత తగ్గడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా, స్క్రీన్పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆహారం మీద దృష్టి తగ్గి జీర్ణక్రియ సరిగా జరగకపోవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి భోజన సమయంలో మొబైల్, టీవీ వంటి స్క్రీన్లను దూరంగా ఉంచి, పిల్లలతో సంభాషిస్తూ తినిపించడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (2)
అత్యంత అవసరమైన అవగాహన — పిల్లల భవిష్యత్తు కోసం స్క్రీన్లకు దూరంగా ఉంచండి!
good message