
జనరల్

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచించారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, కోవిడ్ పరీక్షా కిట్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!