

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది. హీరోగా కొనసాగుతూనే దర్శకుడిగానూ బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ, నటీనటుల ఎంపికకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి వార్త చర్చనీయాంశంగా మారుతోంది.
తాజాగా కథానాయిక ఎంపిక విషయంలో ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో ‘అఖండ 2’తో పాటు ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు రామ్ సరసన కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు ఇది మరో ఆకర్షణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!