

పెద్ది సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో రామ్ చరణ్ దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ టూర్కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు “పవర్ ప్లే టూర్” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టూర్ ద్వారా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చిత్ర బృందం భావిస్తోంది.
మే 18న ముంబైలో ప్రారంభమయ్యే ఈ టూర్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, భోపాల్, విజయనగరం వంటి ప్రధాన నగరాల్లో కొనసాగనుంది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది అభిమానులు హాజరయ్యే ఈ కార్యక్రమం సినిమాకు మరింత హైప్ తీసుకురానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 2న హైదరాబాద్లో జరిగే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఈ టూర్ ముగియనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!