

ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల మధ్య పూజారులు డోలు వాయిద్యాలతో సీఎంకు స్వాగతం పలికారు. రేవంత్రెడ్డి వనదేవతలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వనదేవతల సమక్షంలో మంత్రి సీతక్క సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులకు రాఖీలు కట్టారు. అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!