

మెగాస్టార్ చిరంజీవితో ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు చిరంజీవి కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేశారని, త్వరలోనే మెగాస్టార్కు నరేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం.
బుచ్చిబాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో చేయబోయే తన తదుపరి ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మరో హీరో కోసం ఆయన కథపై పనిచేయడం లేదని సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా దర్శకుడు బాబీ ప్రాజెక్ట్తో పాటు శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు కథలు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి–బుచ్చిబాబు కాంబినేషన్పై జరుగుతున్న ప్రచారం ప్రస్తుతానికి కేవలం సోషల్ మీడియా రూమర్గానే కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!