
జనరల్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’తో పాటు దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాలో కూడా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేక సిచువేషన్ను రూపొందించిన మేకర్స్, ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ను తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె ఈ పాటలో కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో భిన్నమైన లుక్తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!