

సినిమా హీరోలు పారదర్శకత, నిజాయితీ గురించి మాట్లాడినా తమ సినిమాల బడ్జెట్, కలెక్షన్లు, పారితోషికాల వివరాలు మాత్రం బయటకు చెప్పరు. అదే తరహాలో ఇప్పుడు నటుడు విజయ్ రెమ్యూనరేషన్ విషయంలోనూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తన చివరి సినిమా అంటూ విజయ్ నటించిన ‘జన నాయకన్’ చిత్రానికి అతడు భారీ పారితోషికం తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.
ఈ సినిమాతో విజయ్ భారత్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా నిలిచాడని సమాచారం. ఒక్క ఈ సినిమాకు గానూ విజయ్కు దాదాపు రూ.220 కోట్లు పారితోషికం దక్కిందట. జన నాయకన్ మొత్తం బడ్జెట్ సుమారు రూ.380 కోట్లు కాగా, అందులో విజయ్ రెమ్యూనరేషన్ మాత్రమే 50 శాతం కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల కంటే విజయ్ పారితోషికం ఎక్కువగా ఉందని టాక్.
ఇంతకుముందు ‘లియో’, ‘వారసుడు’ సినిమాలకు విజయ్ సుమారు రూ.120 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ‘గోట్’ సినిమాకు దాదాపు రూ.200 కోట్లు తీసుకున్నాడని, తాజా సినిమాకు మరో 10 శాతం పెంచుకున్నాడని అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఇది చివరి సినిమా అనే ప్రచారం కూడా ఈ సినిమా మార్కెట్ విలువను పెంచింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, హీరో పారితోషికం ఆకాశాన్ని తాకుతుంటే, హీరోయిన్ మరియు విలన్కు మాత్రం సుమారు రూ.3 కోట్లు మాత్రమే అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ‘జవాన్’ సినిమాతో రూ.200 కోట్లు తీసుకున్న షారూక్ ఖాన్ రికార్డును కూడా విజయ్ అధిగమించాడని చెబుతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ.160 నుంచి 200 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!