

కోలీవుడ్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం సిగ్మాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31 న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడుతూ ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రూపొందించాలనుకున్నప్పుడు సందీప్ కిషనే తమ మొదటి ఎంపిక అని తెలిపారు. కథ, స్క్రీన్ప్లే నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. తాను రొమాంటిక్ కథ కాకుండా గ్యాంగ్ ఆధారిత హైస్ట్ కథను ఎంచుకున్నానని, ‘సిగ్మా’ విడుదల తర్వాతే నటన గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే షూటింగ్లకు వెళ్లడం, సినిమాలు చూడడం వల్ల కథ చెప్పే నైపుణ్యం పెరిగిందని భావోద్వేగంగా చెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!