

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా దర్శకుడు దేవకట్టా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని, అంతేకాకుండా సినిమాలోని కీలక సన్నివేశాన్ని స్వయంగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
అయితే ఈ ప్రచారంపై దర్శకుడు దేవకట్టా ఘాటుగా స్పందించారు. తాను ఇతర దర్శకుల సినిమాలకు ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం క్లిక్స్, వ్యూస్ కోసం కొందరు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడించారు. సరైన సమయంలో అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొంటూ, ‘డ్రాగన్’ సినిమాపై వస్తున్న పుకార్లకు పూర్తి స్థాయిలో తెరదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!