
జనరల్

నందమూరి బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్లో ‘మార్క్ ఆంటోని’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో గుర్తింపు పొందిన యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో బాలయ్య సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల దర్శకుడు వినిపించిన స్టోరీ లైన్ బాలకృష్ణకు నచ్చడంతో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ హీరో ఎలివేషన్స్తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ క్రేజీ కాంబినేషన్ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!