

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. లేటెస్ట్ కథనాల ప్రకారం, ఓ అతిథి పాత్ర కోసం ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె పోలీస్ పాత్రలో కనిపించబోతుందని, ఆ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యతతో పాటు భావోద్వేగ అంశాలు కూడా ఉంటాయని సమాచారం.
ప్రభాస్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. త్రుప్తి దిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్లో ప్రభాస్ వైల్డ్ అండ్ మాస్ అవతార్లో కనిపిస్తాడనే టాక్ ఉంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కథాంశం కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే ఐశ్వర్య లక్ష్మి పాత్రపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా మరో విభిన్నమైన కాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్తలతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!