

మారుతి–ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి మార్క్ కామెడీతో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కామెడీ లేదా కామెడీ హర్రర్ జానర్ కాదు.
ఈ చిత్రం ప్రధానంగా ఎమోషనల్ కథాంశంతో సాగుతుందట. ప్రభాస్ పాత్ర మాత్రం జోవియల్ గా, సాఫ్ట్ హ్యూమర్తో కనిపిస్తుంది కానీ సినిమా మొత్తం ఒక భావోద్వేగ ప్రయాణంగా వుంటుందట. ముఖ్యంగా రెండో భాగం పూర్తిగా ఎమోషన్పై ఆధారపడి ఉంటుందని, చివరి నలభై నిమిషాలు ప్రేక్షకులను గాఢమైన ఫీల్తో థియేటర్ నుంచి బయటకు పంపుతాయని సమాచారం.
మారుతి అంటే ఫన్ అని మనకు తెలుసు, కానీ ప్రభాస్ అంటే పాన్–ఇండియా స్థాయిలో భారీ ఇమేజ్ కలిగిన స్టార్. ఆ ఇమేజ్కు సరిపడే కథ కావాలని మారుతి గ్రహించాడట. అందుకే, కామెడీకి బదులుగా ప్రేక్షకుల మనసులను తాకే ఎమోషనల్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!