

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన తన అభిమాని సురేష్ పాటిల్ ట్యూమర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు, గుత్తి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సురేష్కు మెరుగైన వైద్యం అందించేందుకు తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్లోని ప్రముఖ సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తూ, వైద్యులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో సురేష్ పాటిల్కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. చికిత్స సమయంలో బాధితుడి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను వరుణ్ తేజ్ కల్పించారు. సురేష్ పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండగా నిలిచారు. గతంలో కూడా అనంతపురానికి చెందిన మరో అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వరుణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ అభిమానుల పట్ల తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!