

ఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ నాయకులకు ఇచ్చిన గాలా డిన్నర్లో కేవలం శాకాహార వంటకాలు వడ్డించడంపై కొనసాగుతున్న రాజకీయ చర్చకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భారతదేశ సార్వభౌమత్వం, సంస్కృతి అనేవి భిన్నమైన ఆచారాలు, మతాలు, భాషలు, ఆహార అలవాట్ల సమ్మేళనమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని 20 శాతానికి పైగా మైనారిటీలు కూడా శాకాహారాన్ని తీసుకుంటారని చెబుతూ, భారత వైవిధ్యం సంస్కృతికే పరిమితం కాదని, భోజన ప్రాధాన్యతల్లోనూ కనిపిస్తుందని అన్నారు. విదేశీ ప్రతినిధులకు వడ్డించిన వంటకాలు ఎంతవరకు నచ్చాయో చెప్పలేమని, అయితే భారత దౌత్యం అంటే దేశంలోని అన్ని సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ వేదికపై ప్రతిబింబించడమేనని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో బ్రిక్స్ సదస్సు ద్వారా సాధించిన దౌత్య, ఆర్థిక ఫలితాలపైనా ఒవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. డిజిటల్ కరెన్సీ వినియోగంపై స్పష్టత లేకపోవడంతో పాటు, చైనాతో భారత్ జరిపిన సరిహద్దు చర్చల్లో పెట్రోలింగ్ హక్కుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత లోపించిందని ఆయన విమర్శించారు. అయితే, బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరాన్, యూఏఈ ప్రతినిధులు ముఖాముఖి సమావేశం కావడాన్ని మాత్రం ఆయన స్వాగతించారు. ఇది ప్రాంతీయ దౌత్య సంబంధాల పరంగా సానుకూల పరిణామమని ఒవైసీ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!