

పశ్చిమాసియా ప్రాంతంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ థాయ్లాండ్లోని లేమ్ చాబాంగ్ పోర్టుకు చేరుకుంది. సుమారు 5,000 మంది అమెరికా నావికులు, మెరైనర్లతో ఉన్న ఈ నౌక 286 రోజులపాటు సముద్రంలో గడిపిన తర్వాత థాయ్లాండ్లో షెడ్యూల్ చేసిన పోర్ట్ విజిట్కు వచ్చింది. సిబ్బందికి విశ్రాంతి, పునరుత్తేజం కోసం ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు అమెరికా నేవీ తెలిపింది. పోర్టుకు సమీపంలోని పర్యాటక నగరం పట్టాయాకు పలువురు సిబ్బంది వెళ్లే అవకాశం ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, వినోద రంగాల్లో వ్యాపారం పెరుగుతుందని స్థానిక వర్గాలు ఆశిస్తున్నాయి.
అయితే అమెరికా నావికుల రాక నేపథ్యంలో పట్టాయాలో భద్రతా చర్యలను అధికారులు మరింత పెంచారు. వియత్నాం యుద్ధం కాలం నుంచి అమెరికా సైనికులకు విశ్రాంతి కేంద్రంగా పట్టాయాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం నగరంలోని నైట్లైఫ్, పర్యాటక ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసులు పెట్రోలింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల నిర్వహించిన సోదాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు అమెరికా సిబ్బంది ఖర్చులతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనాలు ఉండగా.. మరోవైపు ప్రజా భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!