

పాకిస్థాన్లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో జరుగుతున్న పనులు అసలు నిర్మాణాల ప్రామాణికతను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది. పనులను తక్షణమే నిలిపివేయకపోతే ‘వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్’ జాబితాలో చేర్చడంతో పాటు అవసరమైతే వారసత్వ హోదాను రద్దు చేస్తామని యునెస్కో పాకిస్థాన్ అధికారులను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఈ ఏడాది మార్చిలో ఓ సందర్శకుడు తక్షశిలలో జరుగుతున్న పనులపై ఫొటోలు, వివరాలను పాకిస్థాన్ పర్మనెంట్ మిషన్ టు యునెస్కోకు పంపించారు. అసలు రాతి గోడలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టడం, పాత గోడల ఎత్తు పెంచడం వంటి చర్యలు చారిత్రక విలువను దెబ్బతీస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు పురావస్తు సంరక్షణ ప్రమాణాలపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!