

ఢిల్లీలో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు యువకులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న నితేశ్ ఛిబ్ మరో స్నేహితుడితో కలిసి భోజనం చేసి గదిలో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా భవనం కూలిపోయింది. దీంతో ఇద్దరూ శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు వాట్సాప్ ద్వారా తమ లొకేషన్ను స్నేహితులకు పంపించారు. దీంతో సహాయక సిబ్బంది దాదాపు గంటన్నరలోనే వారిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాతే తనకు పూర్తిగా స్పృహ వచ్చిందని నితేశ్ తెలిపారు.
భవనం అంత బలహీనంగా ఉందని తమకు తెలియదని నితేశ్ చెప్పారు. గోడల్లో పగుళ్లు లేదా భవనం కూలే సూచనలు ఏవీ కనిపించలేదని, అయితే బేస్మెంట్లో నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మాత్రం తెలుసని తెలిపారు. ఢిల్లీలో తనలాంటి ఎంతో మంది విద్యార్థులకు హాస్టళ్లే ప్రధాన వసతి సౌకర్యమని, అందువల్ల భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు భవన యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భవనం పాతబడిపోయి, పునాదులు బలహీనంగా ఉన్న విషయం తెలిసినా అద్దెల కోసం అదనపు అంతస్తులు నిర్మించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!