

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో మాట్లాడుతూ, "మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు లీక్ ఇన్ ఇండియా అయ్యింది" అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గత 25 రోజులుగా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతున్నారని, వారి ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పదవులు కాదు, న్యాయం మాత్రమే కోరుతున్నారని అన్నారు.
పరీక్షల్లో పారదర్శకత కోరిన విద్యార్థులపై పోలీసుల చర్యలను కేటీఆర్ ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, పేపర్ లీక్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ప్రతి సమస్యకు కేసీఆర్, కేటీఆర్లనే కారణమని చెప్పడం సరికాదని, యువత న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!