

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థల కదలికలు మళ్లీ వేగం పెంచుతున్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. లష్కరే తోయిబా సీనియర్ నేత హఫీజ్ తల్హా సయీద్ ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి, ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సర్దార్ అట్టీక్ అహ్మద్ ఖాన్ను ఆయన నివాసంలో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో కాశ్మీర్ అంశంతో పాటు అక్కడి రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం.
భద్రతా విశ్లేషకుల ప్రకారం లష్కరే తోయిబా సంస్థ మదరసాలు, అనుబంధ సంస్థల ద్వారా పోకే ప్రాంతంలో మళ్లీ తన నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద శిబిరాలు, సంబంధిత స్థావరాలపై దాడులు జరిగిన తర్వాత సంస్థ తన కార్యకలాపాలను పునర్నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!