
జనరల్

ఇన్స్టాగ్రామ్ ఫొటోల ఆధారంగా ఫేక్ ఇమేజెస్ సృష్టించే అవకాశంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో, మెటా తన అధునాతన ఏఐ ఇమేజ్ జనరేటర్ ‘మ్యూజ్ ఇమేజ్’ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మెటా సూపర్ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ టూల్, కంపెనీ రూపొందించిన తొలి మీడియా జనరేషన్ మోడల్గా నిలిచింది. అయితే డేటా గోప్యత, ఇమేజ్ స్క్రాపింగ్, అనుమతుల విషయంలో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
ఈ టూల్లోని ఫీచర్ ద్వారా పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లోని ఫొటోలను ఉపయోగించి ఏఐ చిత్రాలను సృష్టించే అవకాశం ఉండేది. దీనివల్ల వినియోగదారుల అనుమతి లేకుండా వారి ముఖాలు ఏఐ చిత్రాల్లో కనిపించే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏఐ జనరేటెడ్ వాటర్మార్క్ ఉంటుందని మెటా చెప్పినప్పటికీ, గోప్యతపై పెరిగిన భయాల కారణంగా చివరకు ఈ టూల్ను శనివారం ఉపసంహరించుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!