
ఆరోగ్యం

గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించారు.
ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుండగా, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు దృష్టి సారించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రతి అసెంబ్లీలో మెజారిటీ సాధించాలి. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లలో 148, తమిళనాడులో 234లో 118, కేరళలో 140లో 71, అస్సాంలో 126లో 64, పుదుచ్చేరిలో 30లో 16 సీట్లు అవసరం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!