
జనరల్

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన వృద్ధ యాచకుడు ఎం. పూల్ పాండియన్ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కుటుంబ సభ్యులు వదిలేయడంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన, దక్షిణ తమిళనాడు అంతా తిరిగి ప్రజలు ఇచ్చిన డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు దానం చేస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి కే. కామరాజ్ స్ఫూర్తితో సేవా మార్గంలో నడుస్తున్న పాండియన్ ఇప్పటివరకు రూ.50 లక్షలకు పైగా దానం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మొక్కల నాటకం, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు, కరోనా సమయంలో సహాయం, శ్రీలంకకు మానవతా సాయం వంటి అనేక కార్యక్రమాలకు ఆయన తన సంపాదనను వినియోగించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!