
షోస్

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన రాబోయే చిత్రం ‘గాంధారి’ ప్రమోషన్స్లో మీడియా అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంగనా రనౌత్తో తనకు గతంలో జరిగిన వివాదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ప్రశ్నలు అడగడంపై ఆమె స్పందించారు. ఈ వివాదాన్ని మీడియా, ప్రజలు మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకురావడం వల్లే అది కొనసాగుతున్నట్లు అనిపిస్తోందని తాప్సీ వ్యాఖ్యానించారు.
“మీరు ఈ విషయాన్ని ఎందుకు ముగియనివ్వరు? మా ఇద్దరినీ ఈ ప్రశ్నలు అడగడం ఆపేస్తే ఈ సమస్య కూడా ముగిసిపోతుంది” అంటూ పాత్రికేయులను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. వివాదాలపై ప్రజలు, మీడియా ఆసక్తి చూపుతున్నంత కాలం ఇలాంటి అంశాలు చర్చలోనే ఉంటాయని తాప్సీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఆమె వ్యాఖ్యలు మరోసారి కంగనా–తాప్సీ మధ్య గతంలో చోటుచేసుకున్న వివాదంపై చర్చకు దారితీశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!