
జనరల్

స్పెయిన్లోని వేలెన్సియా నగరంలో భవనంపై నుంచి పడి తెలంగాణ విద్యార్థి గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందినవారు కాగా, ప్రస్తుతం కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోంది.
గత ఆరు నెలలుగా స్పెయిన్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న సాయి అఖిల్ రెడ్డి ఆదివారం ఒకటో అంతస్తు బాల్కనీ నుండి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇది ప్రమాదమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!