

హిందీ బోధన, నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన అంశంలో తమిళనాడు ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందీపై రాష్ట్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు.. భాషకు సంబంధించిన అంశాలను ఘర్షణలకు దారితీయకుండా చర్చలు, పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొంది. విద్యార్థులకు భాషను ఎంచుకునే స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను కూడా కోర్టు ప్రస్తావించింది.
నవోదయ పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భాషా విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు బోధనా మాధ్యమాన్ని ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!