

నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) గుడ్న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా 15 శాతం అఖిల భారత కోటా (AIQ) సీట్లు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్మర్ (పుదుచ్చేరి, కరైకల్)లోని ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. మిగిలిన 85 శాతం స్టేట్ కోటా సీట్లను ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ సంస్థలు భర్తీ చేయనున్నాయి. మొత్తం కౌన్సెలింగ్ మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 5 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ఆగస్టు 6 నుంచి 13 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు జరగగా, ఆగస్టు 17న ఫలితాలు విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!