

భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడని సీఎం కొనియాడారు.
రాజీవ్ గాంధీ దేశంలో మహిళా రిజర్వేషన్లకు బాటలు వేసిన గొప్ప దార్శనీకుడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ కల సాకారమైందని తెలిపారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!