

విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సాంకేతికత ఆధారిత విధానాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్లను ముద్రించింది. తరగతి గదిలో పాఠాలను వెంటనే అర్థం చేసుకోలేని విద్యార్థులు, పాఠశాలకు గైర్హాజరై పాఠాల్లో వెనుకబడే పిల్లలు, సందేహాలను ఉపాధ్యాయులను అడగలేని విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడనుంది. తమకు అనుకూలమైన సమయంలో పాఠాలను మరోసారి నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులు ముందుగా ప్లేస్టోర్ నుంచి సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి. అనంతరం పాఠ్య పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే అంశాల వారీగా విద్యా కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. ఆడియో, వీడియో రూపాల్లో పాఠాలను వినడం, చూడటం ద్వారా విద్యార్థులు సులభంగా విషయాలను అర్థం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా పాఠాలను అభ్యసించే అవకాశం ఈ విధానం ద్వారా లభించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!