
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, వారే నిజమైన దేశభక్తులని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసించారు.
విద్యార్థుల ఉద్యమాన్ని చూస్తే గర్వంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ పరిణామాల తర్వాత దేశ విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!